భాస్కరరావు హత్య కేసు.. ముగ్గురు అరెస్ట్‌

ఇటీవల ఏపీలో దారుణ హత్యకు గురైన మంత్రి  పేర్ని నాని అనుచరుడు, వైసీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కరరావు(50) కేసును పోలీసులు ఛేదించారు.

భాస్కరరావు హత్య కేసు.. ముగ్గురు అరెస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 6:15 AM

ఇటీవల ఏపీలో దారుణ హత్యకు గురైన మంత్రి  పేర్ని నాని అనుచరుడు, వైసీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కరరావు(50) కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజకీయ ఆధిపత్యం చాటేందుకే భాస్కర రావును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా గత నెల 29న బందరులో పట్టపగలు అందరూ చూస్తుండగానే భాస్కరరావును హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఈ హత్యతో కొల్లు రవీంద్ర అనుచరుడు చింతా చిన్నికి సంబంధం ఉన్నట్లు తేల్చారు. అతడితో పాటు మరో ఇద్దరు ఈ హత్యలో భాగమైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని విచారించనున్నట్లు తెలుస్తోంది.