AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం… పోలీసుల వలలో అంతరాష్ట్ర ముఠా!

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశీ వనితలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దంపతులు హైటెక్ పద్దతిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన రజియా, ఆమె భర్త సిరాజుద్దీన్‌లు ఈ […]

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం... పోలీసుల వలలో అంతరాష్ట్ర ముఠా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2019 | 3:23 PM

Share

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశీ వనితలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దంపతులు హైటెక్ పద్దతిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన రజియా, ఆమె భర్త సిరాజుద్దీన్‌లు ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా సాగుతోన్న ఈ ముఠా కార్యకలాపాల గురించి పక్కగా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వారి ఫ్లాట్‌పై దాడిచేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులతో పాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన నలుగురు మహిళలు కూడా పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి రూ.6,580 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, 36 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సెక్షన్ 370A,పిటా ఎక్ట్ కింద కేసు నమోదుచేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఆపరేషన్‌లో మల్కాజిగిరి ఎస్ఓటీ, నెరేడ్‌మెట్ పోలీసుల సంయుక్తంగా నిర్వహించారు.

గత నెలలోనే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మనుషుల అక్రమ రవాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రవాణాకు అడ్డుకట్ట వేసింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకొచ్చి వారితో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను ఛత్రినాక పోలీసుల సాయంతో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి. పాతబస్తీకి చెందిన యూసుఫ్‌ ఖాన్‌, అతడి భార్య బేగంను ఈ కేసులో ప్రధాన నిందితులు. బంగ్లాదేశ్‌ నుంచి ఐదుగురు యువతులను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసిన ఎన్‌ఐఏ అధికారులు ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతులను వారి దేశానికి తిప్పి పంపారు.