AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Sympathisers : తూ.గో జిల్లా మన్యంలో మావోలకు లక్షల రూపాయల సొమ్ములు తరలిస్తోన్న సానుభూతిపరులు అరెస్ట్

బీడీ కాంట్రాక్టర్ల నుండి కుంట, కిష్టారం ఏరియా కమిటీ మావోయిస్టులకు నగదు తరలిస్తుండగా పోలీస్‌ల కంటపడింది. సదరు సొమ్ములు తరలిస్తోన్న మావోయిస్టు సానుభూతి పరులను చింతూరు మండలం గొర్లగూడెం వద్ద..

Maoist Sympathisers : తూ.గో జిల్లా మన్యంలో మావోలకు లక్షల రూపాయల సొమ్ములు తరలిస్తోన్న సానుభూతిపరులు అరెస్ట్
Moist Money
Venkata Narayana
|

Updated on: Jun 15, 2021 | 6:34 PM

Share

Maoist Sympathisers : తూర్పుగోదావరి జిల్లా మన్యంలో భారీగా నగదు పట్టుబడింది. బీడీ కాంట్రాక్టర్ల నుండి కుంట, కిష్టారం ఏరియా కమిటీ మావోయిస్టులకు నగదు తరలిస్తుండగా పోలీస్‌ల కంటపడింది. సదరు సొమ్ములు తరలిస్తోన్న మావోయిస్టు సానుభూతి పరులను చింతూరు మండలం గొర్లగూడెం వద్ద అరెస్ట్ చేసి పోలీసులు సొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తం విలువ రూ.9.93 లక్షలు అని పోలీసులు వెల్లడించారు. సొమ్ములు చేరవేస్తోన్న ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

వీరి దగ్గర్నుంచి నగదుతోపాటు, రెండు బైకులు, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. అయితే, నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు కరోనా నిబంధనలను గాలికొదిలేయగా, మావోయిస్టు సానుభూతి పరులు మాత్రం కరోనా నిబంధనలు తూ.చా తప్పక పాటించడం విశేషం.

Read also : Vijayasai Reddy : చంద్రబాబు అందుకే విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు : విజయసాయి రెడ్డి