వాగులో పడి ఆరుగురు విద్యార్థుల దుర్మరణం

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యార్థులు వాగులో పడి ప్రాణాలను కోల్పోయారు.

వాగులో పడి ఆరుగురు విద్యార్థుల దుర్మరణం
Follow us

|

Updated on: Oct 28, 2020 | 4:37 PM

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యార్థులు వాగులో పడి ప్రాణాలను కోల్పోయారు. వేలేరుపాడు మండ‌లం వ‌సంత‌వాడ‌లో ఈ విషాద ఘటన జరిగింది. దేవీ శరన్నవ‌రాత్రులను పురస్కరించుకుని వ‌సంత‌వాడ‌కు చెందిన కొన్ని కుటుంబాలు వాగు స‌మీపంలో వ‌న‌భోజ‌నాల‌కు వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటుండ‌గా ప్రమాదవశాత్తలు వాగులో మొదట ముగ్గురు విద్యార్థులు పడిపోయారు. వీరిని రక్షించే క్రమంలో మరో ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. చనిపోయిన వారిలో గొట్టిప‌ర్తి మ‌నోజ్‌(15), గంగాధ‌ర వెంకట్రావు(15), కెల్లా ప‌వ‌న్‌(17), క‌ర్నాటి రంజిత్‌(16), కూనార‌పు రాధాకృష్ణ‌(15), శ్రీరాముల శివాజీ(17)గా గుర్తించారు. ఒకే గ్రామంలో ఆరుగురు మరణించడంతో మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. విద్యార్థుల త‌ల్లీదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. వాగులో నుంచి విద్యార్థుల మృత‌దేహాల‌ను స్థానికులు బ‌య‌ట‌కు వెలికితీశారు. అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..