ప్రియురాలి హత్య కేసు: 35 ముక్కలైన శ్రద్ధా మృతదేహం.. ఇంకా దొరకని తల.. నిందితుడి విచారణలో షాకింగ్‌ నిజాలు..

నిందితుడు జొమాటో నుంచి ఫుడ్ డెలివరీ చేయించుకున్నాడు. కానీ, మృతదేహం బయటకు వాసన రాకుండా అగరబత్తులు వెలిగించాడని విచారణలో వెలుగులోకి వచ్చింది.

ప్రియురాలి హత్య కేసు: 35 ముక్కలైన శ్రద్ధా మృతదేహం.. ఇంకా దొరకని తల.. నిందితుడి విచారణలో షాకింగ్‌ నిజాలు..
Delhi Crime
Follow us

|

Updated on: Nov 15, 2022 | 8:38 PM

దేశరాజధానిలో జరిగిన యువతి హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలో లివ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధను అత్యంత క్రూరంగా చంపేశాడు. యువతిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసిన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అడవిలో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు ఇప్పటివరకు శ్రద్ధ మృతదేహంలోని సుమారు 12 ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తల మాత్రం ఇంకా లభించలేదని తెలిసింది. పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న మృతదేహం ముక్కలు శ్రద్ధావి కాదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అఫ్తాబ్‌తో కలిసి మంగళవారం మెహ్రౌలీ అడవుల్లోకి వెళ్లిన పోలీసులు అక్కడ సుమారు రెండున్నర గంటల పాటు సోదాలు నిర్వహించారు. విచారణలో అఫ్తాబ్ పదేపదే వాంగ్మూలం మారుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

లివ్‌ఇన్‌లో ఉంటున్న తన ప్రియురాలు శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. రక్తాన్ని శుభ్రపరచడానికి గూగుల్ సహాయం తీసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేల్చారు.. అలాగే లోపల నుంచి మానవ శరీరం నిర్మాణం ఏమిటో గూగుల్ లో తెలుసుకోవాలనుకున్నాడు. అఫ్తాబ్ మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించనున్నాడని అధికారులు చెబుతున్నారు. వివిధ బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి పోలీసులను పంపుతున్నారు. శ్రద్ధా శరీరాన్ని ఆ దుర్మార్గుడు 35 ముక్కలు చేశాడు. కానీ, కొన్ని ముక్కలు ఇంకా లభించనట్టుగా తెలిసింది.. నిందితుడు జొమాటో నుంచి ఫుడ్ డెలివరీ చేయించుకున్నాడు. కానీ, మృతదేహం బయటకు వాసన రాకుండా అగరబత్తులు వెలిగించాడని విచారణలో వెలుగులోకి వచ్చింది. హత్యానంతరం నిందితుడు రాత్రి 12 నుంచి 1 గంటల మధ్య తన గదిలో నుంచి ఓ ముక్కను మెహ్రౌలీ అడవికి తీసుకెళ్లి అక్కడ విసిరేవాడని వాగ్మూలంలో చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు.

అఫ్తాబ్ శ్రద్ధా శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. ఇందుకోసం సల్ఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగించాడు. దాంతోనే నేలంతా శుభ్రం చేశాడు. తద్వారా ఫోరెన్సిక్ పరీక్షలో ఎలాంటి ఆధారం లభించలేదు. ఆ గొడవలో అఫ్తాబ్ శ్రద్ధ ఛాతీపై కూర్చుని ఆమె గొంతు కోశాడు. ఆమెను చంపిన తర్వాత శ్రద్ధ మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో ఉంచాడు. ఆమెను చంపిన తర్వాత యాసిడ్‌తో ఇళ్లంతా శుభ్రం చేశాడు.ఇందుకోసం గూగుల్ సెర్చ్ చేసినట్టుగా అంగీకరించాడు. శరీరాన్ని కోయడానికి మార్గాలను అన్వేషించినట్టుగా చెప్పాడు. MCDలోని చెత్త సేకరణ వ్యాన్‌లో శ్రద్ధా వేసుకున్న రక్తపు మరకలతో ఉన్న దుస్తులను విసిరేశాడు. ఈ క్రమంలోనే హిమాచల్‌లో, చత్తర్‌పూర్ ప్రాంతంలో నివసించే బద్రీ అనే వ్యక్తిని అఫ్తాబ్ కలిశాడు. అతని కోరిక మేరకు వారిద్దరూ ఛతర్‌పూర్‌కు మాకం మార్చారు. ప్రతిరోజూ శ్రద్ధా శరీర భాగాలను అడవిలో విసిరేవాడని పోలీసులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

శ్రద్ధ ముంబై నివాసి..ఇద్దరూ అక్కడ ఓ కాల్ సెంటర్‌లో పనిచేసేవారు. అక్కడ వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి కుటుంబానికి ఈ సంబంధం ఇష్టం లేకపోవడంతో ఢిల్లీకి పారిపోయారు. ఇక్కడ అద్దె ఇల్లు తీసుకుని అఫ్తాబ్ పెద్ద హోటల్‌లో చెఫ్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో లివ్‌ఇన్‌లో ఉంటున్న శ్రద్ధ పెళ్లిపై ఒత్తిడి తెచ్చింది. ఒకరోజు కోపంతో అఫ్తాబ్ శ్రద్ధను గొంతుకోసి చంపాడు. దీని తరువాత, మృతదేహాన్ని పారవేసేందుకు ముక్కలుగా నరికివేశాడు.. అతను ప్రతి రాత్రి బయటకు వెళ్లి మెహ్రౌలీ అడవుల్లో ఒక్కో ముక్కను విసిరేవాడు.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు..
ఎన్నికల వేళ శుభవార్త.. సామాన్యులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌
ఎన్నికల వేళ శుభవార్త.. సామాన్యులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!
ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో భైరవ.. ప్రభాస్ లుక్ అదుర్స్..
ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో భైరవ.. ప్రభాస్ లుక్ అదుర్స్..