పరాయి వ్యక్తితో ఉన్నప్పుడు చూశాడని.. మరొకరి ప్రైవేట్ పార్ట్‌ని కత్తిరించింది ఓ మహిళ

Bihar Crime News : బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా బిష్ణుపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరాయి వ్యక్తితో గడుపుతుండగా

పరాయి వ్యక్తితో ఉన్నప్పుడు చూశాడని.. మరొకరి ప్రైవేట్ పార్ట్‌ని కత్తిరించింది ఓ మహిళ
Bihar Crime News
Follow us

|

Updated on: May 16, 2021 | 8:58 AM

Bihar Crime News : బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా బిష్ణుపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరాయి వ్యక్తితో గడుపుతుండగా చూశాడని మరొకరి ప్రైవేట్ పార్ట్‌ని కత్తిరించింది ఓ మహిళ. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిష్ణుపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు గతంలో వివాహమైంది. అయితే ఆమెకు చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలియడంతో భర్త వదిలిపెట్టాడు. ఈ క్రమంలోనే హరేంద్ర మాంజీతో ఆమెకు సంబంధం ఏర్పడింది.

అయితే ఆమెతో సంబంధాలు పెట్టుకున్నవారిలో పప్పు భగత్ ఒకరు. ఇదిలా ఉండగా పప్పు భగత్‌తో ఆ మహిళ ఒంటరిగా ఉండటాన్ని చూసిన మాంజీ ఆమెను నిలదీసాడు. దీంతో కోపానికి గురైన ఆమె అతడి పురుషాంగాన్ని కొడవలితో కోసేసింది. గమనించిన స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళ కూడా అతడిపై కేసు పెట్టింది. అతడు తరచూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈ ఆరోపణలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలు ఆమె దగ్గర లేవని తెలిసింది. అయితే బాధితుడు మాంజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరో వ్యక్తి భగత్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Narkuti Deepthi Microsoft: ఏడాదికి రూ. 2 కోట్ల జీతం.. అమెరికాలో హైద‌రాబాద్ అమ్మాయి అద్భుతం..

Corona Shekar Master: డ్యాన్స‌ర్ల‌కు అండ‌గా నిలుస్తోన్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌.. ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా..

Petrol Diesel Price: శాంతించిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. కొన్ని ప్రాంతాల్లో స్వ‌ల్ప మార్పులు.. ఈ రోజు ఫ్యూయ‌ల్ రేట్స్‌..

Lockdown: ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదు..మనసికంగా బాధ..ఈ పెద్దాయన చేసిన పని మీకు కచ్చితంగా కొత్త ఆలోచనలు ఇస్తుంది!