AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robbery: హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. జ్యోతిష్కుని ఇంట్లో రూ. 40 లక్షల రంగు రాళ్లు దోపిడి..

LB nagar hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగరంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యోతిష్కుని ఇంట్లో.. దొంగలు పెద్ద ఎత్తున రంగు రాళ్లను

Robbery: హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. జ్యోతిష్కుని ఇంట్లో రూ. 40 లక్షల రంగు రాళ్లు దోపిడి..
Bank Robbery
Shaik Madar Saheb
|

Updated on: Jun 18, 2021 | 3:55 PM

Share

LB nagar hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగరంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యోతిష్కుని ఇంట్లో.. దొంగలు పెద్ద ఎత్తున రంగు రాళ్లను (రత్నాలు) ఎత్తుకెళ్లారు. జ్యోతిష్కుడు మురళీ కృష్ణ బండ్లగూడా న్యూ వెంకటరమణ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఇంట్లోకు ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.40 లక్షలు విలువ చేసే రత్నాలను ఎత్తుకెళ్లారు. అయితే.. మురళీ కృష్ణ ఈ రోజు ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించినట్లు ఎల్బీ నగర్ పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం ప‌లు ఆధారాలను సేకరించారు.

మురళీకృష్ణకు హైద‌రాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో రంగురాళ్ల దుకాణాలు ఉన్నాయి. ఈ వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన రత్నాలు తీసుకువచ్చాడు. వెంకటరమణ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్న ముర‌ళీకృష్ణ.. ఇటీవల కొన్నింటిని విక్రయించాడు. ఈ క్ర‌మంలో మిగిలిన వాటిని ఇంట్లోనే ఉంచి బ‌య‌ట‌కు వెళ్లిన క్రమంలో.. అప్పటికే మాటు వేసిన దొంగలు చోరీకి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మురళీకృష్ణ ఇచ్చిన సమాచారంతో ప‌లువురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు అనంతరం ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్బీ నగర్ పోలీసులు తెలిపారు.

Also Read:

Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ