Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో..

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి
Road Accident
Follow us

|

Updated on: Oct 31, 2022 | 5:38 AM

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం సీతాగొంది వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తున్న ఓ కారు కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్‌ జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, ప్రమాదాలు జరిగేందుకు అనేక కారణాలున్నాయి. ఓవర్‌టెక్‌ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపం, అతి వేగం తదితర కారణాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి