AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్‌లో దారుణం.. పోలీసును కాల్చి చంపిన దుండగులు

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని లోహియా నగర్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో.. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కన్పించారు. అయితే పోలీసులను చూసిన వారు.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగులు ఓ పోలీస్ హోంగార్డ్‌ను కాల్చిచంపారు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన ముగ్గురు దుండగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. […]

బీహార్‌లో దారుణం.. పోలీసును కాల్చి చంపిన దుండగులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2020 | 5:53 PM

Share

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని లోహియా నగర్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో.. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కన్పించారు. అయితే పోలీసులను చూసిన వారు.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగులు ఓ పోలీస్ హోంగార్డ్‌ను కాల్చిచంపారు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన ముగ్గురు దుండగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. స్పాట్‌లోనే మరణించిన పోలీస్ హోంగార్డు బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విధుల్లో ఉన్న సమయంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. కుటుంబానికి రెగ్యులర్‌గా రూ.2000 పెన్షన్ కూడా అందేలా చూడాలని పోలీస్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.