AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీలో దారుణం.. కడుపునొప్పితో వెళితే వార్డ్ బాయ్‌ చికిత్స.. చివరకు..

Old City Private Hospital: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన స్వర్ణకారుడు వైద్యం వికటించి మృతిచెందాడు. చార్మినార్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరితగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వార్డుబాయ్​ ఇచ్చిన ట్రీట్​మెంట్

Hyderabad: పాతబస్తీలో దారుణం.. కడుపునొప్పితో వెళితే వార్డ్ బాయ్‌ చికిత్స.. చివరకు..
Old City Private Hospital
Shaik Madar Saheb
|

Updated on: Dec 09, 2021 | 10:03 PM

Share

Old City Private Hospital: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన స్వర్ణకారుడు వైద్యం వికటించి మృతిచెందాడు. చార్మినార్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరితగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వార్డుబాయ్​ ఇచ్చిన ట్రీట్​మెంట్​ కారణంగానే వైద్యం వికటించి స్వర్ణకారుడు మృతి చెందాడని బాధితుడి బంధువులు పేర్కొంటున్నారు. ఈ ఘటన అనంతరం మృతుడి బంధువులు, న్యాయవాదులు, టీఆర్ఎస్​నాయకులు ఆసుపత్రి ఎదుట బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు చెందిన అష్టరాయ్​18 సంవత్సరాల క్రితం హైదరాబాద్​పాతబస్తీ ఝాన్సీబజార్‌కు వలస వచ్చి నివసిస్తున్నాడు. ఝాన్సీబజార్‌లో ఓ జ్యువెల్లరీ దుకాణంలో స్వర్ణకారుణిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాయ్​కు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో భార్య స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లింది. అక్కడ ఉన్న సిబ్బంది రాయ్‌కు ఇంజెక్షన్​ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాసేపటికే రాయ్​మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు తెలియజేశారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. అప్పటివరకూ బాగానే ఉన్న రాయ్.. ఎలా మరణించాడని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. వారినుంచి సరైన స్పందన లేకపోవడంతో.. కుటుంబభ్యులు స్థానిక టీఆర్ఎస్​నాయకుడు దీపాంకర్​పాల్​దృష్టికి తీసుకువచ్చారు.

వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వార్డ్ బాయ్ అష్టరాయ్‌కు ఇంజక్షన్ ఇచ్చాడని.. దీని కారణంగా వైద్యం వికటించి మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు, న్యాయవాది ఎ.మాణిక్​ ప్రభుగౌడ్​, టిఆర్ఎస్​నాయకులు తదితరులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వార్డు బాయ్‌తో చికిత్స చేయించారని, యాజమన్యం నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని, వెంటనే ఆసుపత్రిని సీజ్​ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలాగే మృతుని కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకు దిగిన వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్​పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నూర్ మహ్మద్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్

Also Read:

Road Accident: శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి సహా దంపతుల మృతి..

Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..