AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..

Maharashtra: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ సిటీలో ఓ వ్య‌క్తి కిరాతకంగా వ్యవహరించాడు. త‌న ఇంట్లో భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను, అత్త‌గారింట్లో

దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2021 | 11:03 PM

Share

Maharashtra: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ సిటీలో ఓ వ్య‌క్తి కిరాతకంగా వ్యవహరించాడు. త‌న ఇంట్లో భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను, అత్త‌గారింట్లో అత్త‌ను, మ‌ర‌ద‌లును హ‌త్య‌చేసి ఆ త‌ర్వాత ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాగ్‌పూర్‌లోని ప‌చ్‌ప‌వోలీ ఏరియాలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అలోక్ మ‌తుకార్ అనే వ్య‌క్తి సోమవారం తెల్ల‌వారుజామున త‌న భార్య విజ‌య (40) గొంతుకోసి చంపేశాడు. ఆ త‌ర్వాత కుమార్తె పారి (14), కొడుకు సాహిల్ (12) ను కూడా గొంతు కోసి కడతేర్చాడు. ఆ త‌ర్వాత అత్త‌గారింటికి వెళ్లి అత్త ల‌క్ష్మీ బోబ్డే (55), మ‌ర‌ద‌లు అమీషా బోబ్డే (21) ల‌ను గొంతులు కోసి చంపాడు. ఆ త‌ర్వాత త‌న ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

తొమ్మిది గంట‌లైనా ఇంట్లో నుంచి ఎవ‌రూ బ‌య‌టికి రాక‌పోవ‌డంతో పొరుగింటి వారు అనుమానం వ‌చ్చి కిటికీలోంచి చూడ‌గా ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహాలు ప‌డివున్నాయి. అనంతరం వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మ‌తూక‌ర్ ఇంటి తలుపులు ప‌గుల‌గొట్టి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత మ‌తూక‌ర్ ఇంటికి సమీపంలో ఉన్న అత‌ని అత్త‌గారింట్లో అత్త ల‌క్ష్మి, మ‌ర‌ద‌లు అమీషా కూడా హ‌త్య‌కు గురైన‌ట్లు గుర్తించి వారి మృత‌దేహాల‌ను కూడా పోస్టుమార్టానికి త‌ర‌లించారు. మ‌తూక‌ర్ టైల‌రింగ్ బిజినెస్ చేస్తున్నాడ‌ు. అయితే.. గత కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు అవుతున్నాయని.. ఆ కార‌ణంగానే మాతుకర్ ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Harassment: మార్ఫింగ్ ఫోటోలతో మహిళలకు బెదిరింపులు.. పక్కా స్కెచ్ వేసి అడ్డంగా బుక్ చేసిన..

ఈ నాలుగు రాశుల వారు బంధాల నుంచి విడిపోవడం విషయంలో చాలా ఫాస్ట్.. ఏ రాశుల వారు..ఎందుకు అలా ఉంటారు?

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు