దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..

Maharashtra: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ సిటీలో ఓ వ్య‌క్తి కిరాతకంగా వ్యవహరించాడు. త‌న ఇంట్లో భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను, అత్త‌గారింట్లో

దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..
Follow us

|

Updated on: Jun 21, 2021 | 11:03 PM

Maharashtra: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ సిటీలో ఓ వ్య‌క్తి కిరాతకంగా వ్యవహరించాడు. త‌న ఇంట్లో భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను, అత్త‌గారింట్లో అత్త‌ను, మ‌ర‌ద‌లును హ‌త్య‌చేసి ఆ త‌ర్వాత ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాగ్‌పూర్‌లోని ప‌చ్‌ప‌వోలీ ఏరియాలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అలోక్ మ‌తుకార్ అనే వ్య‌క్తి సోమవారం తెల్ల‌వారుజామున త‌న భార్య విజ‌య (40) గొంతుకోసి చంపేశాడు. ఆ త‌ర్వాత కుమార్తె పారి (14), కొడుకు సాహిల్ (12) ను కూడా గొంతు కోసి కడతేర్చాడు. ఆ త‌ర్వాత అత్త‌గారింటికి వెళ్లి అత్త ల‌క్ష్మీ బోబ్డే (55), మ‌ర‌ద‌లు అమీషా బోబ్డే (21) ల‌ను గొంతులు కోసి చంపాడు. ఆ త‌ర్వాత త‌న ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

తొమ్మిది గంట‌లైనా ఇంట్లో నుంచి ఎవ‌రూ బ‌య‌టికి రాక‌పోవ‌డంతో పొరుగింటి వారు అనుమానం వ‌చ్చి కిటికీలోంచి చూడ‌గా ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహాలు ప‌డివున్నాయి. అనంతరం వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మ‌తూక‌ర్ ఇంటి తలుపులు ప‌గుల‌గొట్టి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత మ‌తూక‌ర్ ఇంటికి సమీపంలో ఉన్న అత‌ని అత్త‌గారింట్లో అత్త ల‌క్ష్మి, మ‌ర‌ద‌లు అమీషా కూడా హ‌త్య‌కు గురైన‌ట్లు గుర్తించి వారి మృత‌దేహాల‌ను కూడా పోస్టుమార్టానికి త‌ర‌లించారు. మ‌తూక‌ర్ టైల‌రింగ్ బిజినెస్ చేస్తున్నాడ‌ు. అయితే.. గత కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు అవుతున్నాయని.. ఆ కార‌ణంగానే మాతుకర్ ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Harassment: మార్ఫింగ్ ఫోటోలతో మహిళలకు బెదిరింపులు.. పక్కా స్కెచ్ వేసి అడ్డంగా బుక్ చేసిన..

ఈ నాలుగు రాశుల వారు బంధాల నుంచి విడిపోవడం విషయంలో చాలా ఫాస్ట్.. ఏ రాశుల వారు..ఎందుకు అలా ఉంటారు?

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన