AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: అరాచకం.. సిగిరేట్ల డబ్బులడిగితే.. దారుణంగా కొట్టి చంపారు.. ఎక్కడంటే..?

Madhya Pradesh Crime News: షాపులో సిగిరేట్లు తీసుకున్నారు.. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు యాజమానిని కొట్టి చంపారు. ఈ అరాచక సంఘటన మధ్యప్రదేశ్‌లోని షహ్దోల్‌

Crime News: అరాచకం.. సిగిరేట్ల డబ్బులడిగితే.. దారుణంగా కొట్టి చంపారు.. ఎక్కడంటే..?
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Oct 17, 2021 | 1:15 PM

Share

Madhya Pradesh Crime News: షాపులో సిగిరేట్లు తీసుకున్నారు.. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు యాజమానిని కొట్టి చంపారు. ఈ అరాచక సంఘటన మధ్యప్రదేశ్‌లోని షహ్దోల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దుకాణంలో సిగరెట్లు తీసుకొని డబ్బులు అడిగినందుకు నలుగురు కలిసి దుకాణ యజమానిని కొట్టిచంపినట్లు షహ్దోల్ పోలీసులు వెల్లడించారు. షహ్దోల్‌ జిల్లా కేంద్రానికి 90కి.మీల దూరంలో డియోలాండ్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో నలుగురు వ్యక్తులు అరుణ్‌ సోని దుకాణానికి వెళ్లారు. అనంతరం సిగరెట్లు అడిగి తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని అరుణ్ సోని అడగ్గా.. అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుపడిన యజమాని కొడుకులపైనా దాడిచేశారని పోలీస్‌ అధికారి భవిష్య భాస్కర్‌ వెల్లడించారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణ్ సోనిని.. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో అరుణ్ కొంతసేపటికే మృతి చెందినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కేసులో మోనుఖాన్‌, పంకజ్‌ సింగ్‌, విరాట్‌ సింగ్‌, సందీప్‌ సింగ్‌లను నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

MLA KY Nanjegowda: గాలిలోకి కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేమైందంటే..?

Aryan Khan: పేదలకు చేయూతనిస్తా.. తప్పుడు మార్గంలో నడవను.. షారుఖ్ కొడుకు ఆర్యన్ హామీ..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం