Lovers Sucide: ప్రేమజంట ఆత్మహత్య.. అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహాలు..

Lovers sucide in Nizamabad: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన

Lovers Sucide: ప్రేమజంట ఆత్మహత్య.. అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహాలు..
Lovers sucide
Follow us

|

Updated on: Jun 10, 2021 | 11:43 AM

Lovers sucide in Nizamabad: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని చందూరు మండలం లక్ష్మీపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీప్రాంతంలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి.

మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్‌, లక్ష్మిగా గుర్తించారు. ఇద్దరూ వారం రోజుల కిందటే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read;

Covid Children: పిల్లలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వద్దు, తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయిడ్స్.. కరోనా చికిత్సపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం.. కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే ఉద్యోగికి 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్!