AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య ఆ పని చేస్తోందని తెలిసి బలవన్మరణానికి పాల్పడిన భర్త..

వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చురాజేస్తున్నాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

భార్య ఆ పని చేస్తోందని తెలిసి బలవన్మరణానికి పాల్పడిన భర్త..
Software Employee
S Srinivasa Rao
| Edited By: Srikar T|

Updated on: Mar 31, 2024 | 3:23 PM

Share

వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చురాజేస్తున్నాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన భార్య ప్రవర్తనతో విసిగి చెందిన బెజ్జిపురం గ్రామానికి చెందిన పొట్నూరు కాంతి కిరణ్(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆవేదనను సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో ద్వారా బయట పెట్టాడు. జిల్లాలో ఇదే ఇప్పుడు వైరల్ అవుతుంది. తన భార్య పలువురితో వివాహేతరసంబంధం పెట్టుకొని వాళ్ల ద్వారా తనను వేధింపులకు గురిచేస్తోందని కాంతికిరణ్ వీడియోలో పేర్కొన్నారు. తనపై దాడి చేయించి తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టీ వేదించిందంటూ సేల్ఫీ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు కాంతి కిరణ్.

తన కుటుంబ సభ్యులు సైతం ఆమెకు వత్తాసు పలికారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఓ లాయర్ సహా తన భార్యతో వివాహేతర సంబoధం జరిపిన వారి పేర్లను, తనను వేధించిన వారి పేర్లను చెప్పాడు కాంతి కిరణ్. తాను చెప్పిన సెల్ఫీ వీడియోని మరణ వాగ్మూలంగా పరిగనించాలని కోరాడు. తన స్వగ్రామం బెజ్జిపురంలో బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాంతి కిరణ్. తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. కాంతి కిరణ్ ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికి కుటుంబసభ్యులు గమనించారు. అప్పటికే మృతి చెందగా లావేరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాంతి కిరణ్ ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బెంగుళూరులో కొన్నాళ్ళు కాపురం చేసి కరోనా సమయంలో ఉద్యోగం వదిలి స్వగ్రామం వచ్చేసాడు. తర్వాత తిరిగి సాప్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ ఫ్రమ్ చేస్తూ వచ్చాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే గత కొద్ది నెలలుగా భార్య భర్తల మధ్య వివాహేతర సంబంధం విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంతి కిరణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతని స్వగ్రామం బెజ్జిపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..