Chhattisgarh dies: ఛత్తీస్‌గఢ్‌లో కొంపముంచిన నాటు వైద్యం.. మందు వికటించి 8 మంది మృతి, ఐదుగురికి సీరియస్

ఛత్తీస్‌గఢ్‌లో విషాదంలో చోటుచేసుకుంది. బిలాస్‌పూర్‌ జిల్లాలో వైద్యం వికటించిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఐదుగురికి సీరియస్.

Chhattisgarh dies: ఛత్తీస్‌గఢ్‌లో కొంపముంచిన నాటు వైద్యం.. మందు వికటించి 8 మంది మృతి, ఐదుగురికి సీరియస్
Family Dies After Consuming Homeopathic Medicine In Chhattisgarh
Follow us

|

Updated on: May 06, 2021 | 4:42 PM

Family dies in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదంలో చోటుచేసుకుంది. బిలాస్‌పూర్‌ జిల్లాలో వైద్యం వికటించిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్చించారు. హోమియోపతి ఔషధాలే ఈ మరణాలకు కారణమని బిలాస్‌పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఔషధాల్లో ఆల్కహాల్ ఉండటమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, వీరందరికి చికిత్స చేసిన వైద్యుడు పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. మంగళవారం రాత్రి నలుగురు బాధితులు చనిపోగా.. మిగతా నలుగురు బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. బాధితులు కమలేశ్ ధూరి (32) అక్షయ ధూరి (21), రాజేశ్ ధూరి (21), సామ్రూ ధూరి (25)లు ద్రోసరే 30 ఔషధం తీసుకున్నట్టు తెలిపారు. ఇదే ఔషధం తీసుకున్న ఖేమ్‌చంద్ ధూరి (40), కైలాశ్ ధూరి (50), దీపక్ ధూరి (30)‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

కోర్మి గ్రామానికి చెందిన కమలేశ్ ధూరి కుటుంబం కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానిక వైద్యుడిని ఆశ్రయించారు. దీంతో వారికి ద్రొసరే 30 అనే ఔషధాన్ని ఇచ్చాడు. ఇది సేవించిన కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అయితే, ద్రొసరే 30 అనే ఈ ఔషధం తయారీలో ఆల్క్‌హాల్‌కు బదులు నాటుసారాను వినియోగించారని తెలిపారు. హోమియోపతి చికిత్సలో ఈ ఔషధాన్ని గొంతునొప్పి, జలుబు వంటి ఇబ్బందులతో బాధపడుతున్నవారికి వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉండటంతో చత్తీస్‌గఢ్ వైద్యుడు దీనిని ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేలా విచారం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆయన ఆదేశించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, మంగళవారం మృతిచెందినవారికి కోవిడ్ ఉందనే అనుమానంతో అధికారులకు తెలియకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం అక్కడకు చేరుకున్న పోలీసులు.. అస్వస్థత గురైన మరో ఐదుగుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగుర్ని చత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు, ఇంకొకర్ని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read Also…  Attacked on Muralidharan: బెంగాల్‌లో యథేచ్చగా హింస.. కేంద్ర మంత్రి మురళీధరన్‌ వాహనంపై దాడి.. కారు ధ్వంసం, పలువురికి గాయాలు

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?