AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి, భర్తల మోసానికి.. నవవధువు బలి

తల్లి, భర్త ప్రవర్తన కారణంగా.. మానసిక వేదనకు గురైన ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మీర్‌పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మీర్ పేట‌ అల్మాస్ గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబూరావుతో..

తల్లి, భర్తల మోసానికి.. నవవధువు బలి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 10:38 AM

Share

తల్లి, భర్త ప్రవర్తన కారణంగా.. మానసిక వేదనకు గురైన ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మీర్‌పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మీర్ పేట‌ అల్మాస్ గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబూరావుతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటూ.. క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు నవీన్‌కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరచూ నవీన్ అనిత వాళ్లింటికి వెళ్తూండేవాడు. అయితే.. ఎలాగైనా అతనితో శాశ్వతంగా ఉండాలన్న ఉద్దేశంతో అనిత.. తన కూతురు వందన(19)ని ఇచ్చి వివాహం చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 1న వీరి వివాహం జరిగింది.

అయితే వివాహమైన తరువాత కూడా అనిత, నవీన్ కుమార్‌ల వివాహేతర సంబంధం కొనసాగేది. ఇది గమనించిన వందన విడిగా ఉందామని.. భర్తకు చెప్పగా.. ఇంట్లో నుంచి వెళ్లిపోతే.. తాను చనిపోతానంటూ అనిత బెదిరించింది. దీంతో.. తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్ నోట్ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వెంటనే వందన సోదరి సంజన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు చేస్తున్నారు.

Read More this also: శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి!

‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!

రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి