AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో మునిగిపోయిన పర్యాటకుల బోటు.. ఏపీ, తెలంగాణ వాసుల గల్లంతు..!

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వియత్నామీస్ యంత్రాంగం వేగంగా స్పందించింది. విస్తృతస్థాయిలో సహాయక మరియు గాలింపు చర్యలను చేపట్టింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సముద్రంలో మునిగిపోయిన పర్యాటకుల బోటు.. ఏపీ, తెలంగాణ వాసుల గల్లంతు..!
Boat Capsized
Balaraju Goud
|

Updated on: Jul 11, 2026 | 4:30 PM

Share

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వియత్నామీస్ యంత్రాంగం వేగంగా స్పందించింది. విస్తృతస్థాయిలో సహాయక, గాలింపు చర్యలను చేపట్టింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతులలో ఎంతమంది భారతీయులు ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ఆ పడవలో 24 మంది భారత పౌరులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి 105 మంది పర్యాటకులు వియత్నాం సందర్శనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ పడవలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు, తమిళనాడుకు చెందిన 17 మందితో సహా సుమారు 24 మంది ప్రయాణిస్తున్నారని శ్రీనివాస్ అనే పర్యాటకుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు క్షేమంగా ఉండగా, ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చారు. అలాగే తమిళనాడుకు చెందిన పలువురు కూడా ఆసుపత్రి పాలయ్యారు.

మరోవైపు, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. బాధిత భారతీయుల వివరాల కోసం, వారికి తక్షణ సహాయం అందించడం కోసం స్థానిక అధికారులతో రాయబార కార్యాలయం నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. “వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో కొద్ది గంటల క్రితం భారతీయ పర్యాటకులతో కూడిన పడవ బోల్తా పడిన విషాద ఘటన జరిగింది. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు” అని రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ‘X’ ద్వారా అధికారికంగా ధృవీకరించింది.

బాధిత పర్యాటకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే, అవసరమైన వైద్య, రవాణా సహాయాన్ని సమకూర్చేందుకు భారత రాయబార కార్యాలయం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకోసం హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచారం కోసం +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పాటు హనోయిలో కూడా మరో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దాని కోసం +84 91 308 9165 నంబర్‌ను అందుబాటులో ఉంచారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. వర్షం పడనప్పటికీ, సముద్రపు అలల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర పర్యాటక పడవలు మానవత్వంతో స్పందించి రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. ఒక పడవ నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం.. పడవ బోల్తా పడిన ఐదు నిమిషాల్లోనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, చాలా మంది పర్యాటకులు బోల్తా పడిన పడవ లోపలే చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. కొంతమందిని మాత్రమే స్పృహతో ఉన్న స్థితిలో బయటకు తీయగలిగారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందని సమాచారం. భద్రతా సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేశారు..

Follow Us
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర