మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, గవర్నర్
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళసౌ సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళసౌ సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం భరోసా నిచ్చారు. యావత్ సమాజం కార్మిక లోకానికి అండగా నిలవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. మేడే సందర్భంగా కార్మికులు బయటకు రాకుండానే ఉత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
అటు, కార్మికలోకానికి గవర్నర్ తమిళసౌ సౌందర్ రాజన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని గవర్నర్ కోరారు. జాతి నిర్మాణంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.