AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ తెలంగాణలో విజృంభింస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ని ఎదుర్కోడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 26, 2020 | 6:57 AM

Share

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ తెలంగాణలో విజృంభింస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ని ఎదుర్కోడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుం బిగించారు. తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం, ఒక ఏడాది నియోజక వర్గ అభివృద్ధికి నిధులు మొత్తం కలిపి దాదాపు రూ.500 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు. దాదాపు ఒక్కో ఎంపీ ఏడాదికి ఐదు కోట్ల రూపాయలను తమ నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలకు మొత్తం 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి డొనేట్ చేయనున్నారు.

దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఉప నాయకుడు బండ ప్రకాష్, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వర రావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు లెటర్‌ను అందించారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తన ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వారికి ఏడాదికి విడుదలయ్యే నిధులను కూడా సీఎం సహాయ నిధికి డొనేట్ చేయనున్నట్లు టీఆర్ఎస్ శాసన సభా పక్షం ప్రకటించింది.

కాగా కరోనా వ్యాప్తి నివారణ కోసం చేపట్టే కార్యక్రమాలకు ఈ నిధులను వాడాలని వారు కోరారు. అయితే ఇంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించిన నేతలను సీఎం కేసీఆర్ అభినందించారు. చట్టసభ సభ్యులు చూపించిన స్ఫూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహం ఇస్తుందన్నారు. అనే ప్రముఖులు ఆపద సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. అలాగే.. రాజ్యసభ, లోక్‌ సభ సభ్యులు మరో నెల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి అందిస్తారని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

Follow Us
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!