AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇవాళ మూడు కేసులే!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగానే ఉంది. ఇవాళ రాష్ట్రంలో మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు 1085. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు..

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇవాళ మూడు కేసులే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 04, 2020 | 9:49 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగానే ఉంది. ఇవాళ రాష్ట్రంలో మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు సంఖ్య 1085కి చరింది. అలాగే ఇప్పటివరకూ 29 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే ఈ రోజు 40 మంది డిశ్చార్జి అవ్వగా.. దీంతో ఇప్పటివరకూ మొత్తం 585 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణలో 471 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే జీహెచ్‌ఎంసీ మినహా ఇతర జిల్లాల్లో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, కరోనా ఫ్రీ జిల్లాలు కూడా పెరుగుతున్నాయని ఈటల పేర్కొన్నారు. అలాగే గత 14 రోజుల్లో కామారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, నారాయణ పేట, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఆయుష్మాన్