ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
లాక్డౌన్తో ఎక్కడి జనం అక్కడే ఉండిపోయారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో వెసులుబాటు లభించింది. దీంతో దూర ప్రాంతాల్లో చిక్కుకు పోయినవారు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. హైదరాబాద్లో సుమారు 400 మంది ఏపీ ఉద్యోగులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. సోమేశ్కుమార్ పంపిన లేఖకు తెలంగాణ […]
లాక్డౌన్తో ఎక్కడి జనం అక్కడే ఉండిపోయారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో వెసులుబాటు లభించింది. దీంతో దూర ప్రాంతాల్లో చిక్కుకు పోయినవారు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. హైదరాబాద్లో సుమారు 400 మంది ఏపీ ఉద్యోగులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. సోమేశ్కుమార్ పంపిన లేఖకు తెలంగాణ సీఎస్ స్పందించారు. వారి బస్సులకు అనుమతినిచ్చింది. దీంతో ఈ ఉదయం (27మే) వారిని తొలిదశలో భాగంగా 250 మందిని అమరావతికి తరలించారు. రెండో విడుతలో మరో 150 తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.