తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. వారికి కూడా రూ.1500 సాయం..

వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకొని వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆర్ధిక సాయాన్ని మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్ తీసుకోకుండా ఏప్రిల్‌లో తీసుకున్న 2.08 లక్షల మంది లబ్ధిదారులకు.. ఏప్రిల్, మే నెలలకు గానూ ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున మొత్తంగా రూ.62.40 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసింది. గతంలో మూడు నెలల పాటు కార్డు ఉండి కూడా రేషన్ తీసుకొని వారికి రూ.1,500 ఆర్ధిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు […]

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. వారికి కూడా రూ.1500 సాయం..
Follow us

|

Updated on: May 24, 2020 | 4:33 PM

వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకొని వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆర్ధిక సాయాన్ని మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్ తీసుకోకుండా ఏప్రిల్‌లో తీసుకున్న 2.08 లక్షల మంది లబ్ధిదారులకు.. ఏప్రిల్, మే నెలలకు గానూ ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున మొత్తంగా రూ.62.40 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసింది. గతంలో మూడు నెలల పాటు కార్డు ఉండి కూడా రేషన్ తీసుకొని వారికి రూ.1,500 ఆర్ధిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే మూడు నెలల రేషన్ తీసుకోలేదన్న నిబంధనతో కరోనా సాయాన్ని నిలిపివేయోద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించడంతో ఏప్రిల్‌లో బియ్యం తీసుకున్న లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ వారి అకౌంట్లలోకి నగదు జమ చేసింది. ఏప్రిల్ నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల మంది లబ్దిదారులకు రూ. 1,500 చొప్పున మొత్తంగా రూ. 2,227 కోట్లను జమ చేసింది. అటు బ్యాంకు ఖాతాలు లేనివారికి మరో రూ. 158. 24 కోట్లు అందజేసింది. కాగా, ఇప్పటివరకు 81.49 లక్షల మంది లబ్దిదారులకు 3 లక్షల 25 వేల టన్నుల ఉచిత బియ్యం, 5187 టన్నుల కందిపప్పును పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

ఇది చదవండి: రూ.100 ఫైన్ తీసుకుని.. వాహనాలను విడిచిపెట్టండి..