AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే..

లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన టెన్త్ ఎగ్జామ్స్‌ను నిర్వహించేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పది పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఉదయం 9. 30 నుంచి 12.15 నిమిషాల వరకు పరీక్షలు జరగనుండగా.. ప్రతీ పరీక్షకు రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు. అటు కరోనా నేపధ్యంలో ఎగ్జామ్స్ నిర్వహణ విషయంలో పలు మార్గదర్శకాలను […]

తెలంగాణ పదో తరగతి పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే..
Ravi Kiran
|

Updated on: May 23, 2020 | 12:01 AM

Share

లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన టెన్త్ ఎగ్జామ్స్‌ను నిర్వహించేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పది పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఉదయం 9. 30 నుంచి 12.15 నిమిషాల వరకు పరీక్షలు జరగనుండగా.. ప్రతీ పరీక్షకు రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు. అటు కరోనా నేపధ్యంలో ఎగ్జామ్స్ నిర్వహణ విషయంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి…

  • విద్యార్ధులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు.
  • ఒక బెంచ్‌కు ఒక విద్యార్ధి మాత్రమే కూర్చుంటారు
  • పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి
  • భౌతిక దూరం పాటించాలి
  • ఎగ్జామ్‌కు గంట ముందు వచ్చినా కేంద్రాల్లోకి అనుమతి
  • కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు
  • దగ్గు, జలుబు, జ్వరం ఉన్న విద్యార్దులకు ప్రత్యేక గదుల్లో పరీక్ష
  • సెంటర్ల వివరాలు, సహాయం కోసం హెల్ప్ లైన్స్
  • ప్రతీ కేంద్రంలోనూ హ్యాండ్ శానిటైజర్లు, మెడికల్ సిబ్బంది ఉంటారు
  • పరీక్షలు సుమారుగా 2500 కేంద్రాల్లో నిర్వహిస్తారు.

Read More:

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..

రైల్వే ప్రయాణీకులకు మరో శుభవార్త…