కరోనాపై పోరు.. పోలియో వ్యాక్సిన్తో మంచి ఫలితాలు..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సిన్ కచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఆ తరువాత పరిస్థితులను ఊహించడం కూడా కష్టమే.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సిన్ కచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఆ తరువాత పరిస్థితులను ఊహించడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు తీపి కబురును వెల్లడించారు. మనకు అందుబాటులో ఉన్న టీబీ, పోలియో వ్యాక్సిన్లతో కరోనా బారి నుంచి తాత్కాలిక రక్షణ పొందొచ్చని చెబుతున్నారు. పరిశోధనల్లో ఈ విషయం తెలిసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఇక ఈ విషయంలో తమ పరిశోధనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి తాత్కాలిక రక్షణ పొందేందుకు టీబీ వ్యాక్సిన్ ఒక్కటేనని టెక్సాస్లోని ఎ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో పేర్కొన్నారు. దీని వలన ఊపిరితిత్తుల సమస్యతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీసీజీ వ్యాక్సిన్ కూడా ప్రజల రోగనిరోధక శక్తి మెరుగుపడే అవకాశం ఉందని కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ వ్యాక్సిన్లు మంచి ఫలితాలను ఇస్తే కరోనాను కొంతమేర కట్టడి చేయొచ్చు.
Read This Story Also: ఆన్లైన్ క్లాస్లతో సైడ్ ఎఫెక్ట్స్.. ఫిర్యాదులు చేస్తోన్న తల్లిదండ్రులు