AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా బాధితుల కోసం ఏపీకి చేరిన ప్ర‌త్యేక బోగీలు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపురం స్టేషన్ కు పది కోచ్ లతో కూడిన ప్రత్యేక‌ రైలు ను కేటాయించింది.

క‌రోనా బాధితుల కోసం ఏపీకి చేరిన ప్ర‌త్యేక బోగీలు
Jyothi Gadda
|

Updated on: Apr 10, 2020 | 3:48 PM

Share
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపురం స్టేషన్ కు పది కోచ్ లతో కూడిన ప్రత్యేక‌ రైలు ను కేటాయించింది. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేషన్ లోని కోచ్ కేర్ డిపో ఆధ్వర్యం లో పది బోగి లలో 100బెడ్స్ ఏర్పాటు కు ముమ్మర చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇప్పటికీ ఆరు బోగిలలో పనులు పూర్తి కాగా, రేపటికి మొత్తం పది బోగీలు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
ప‌ది కోచ్ లలో ఎనిమిది జనరల్ కోచ్ లు, రెండు స్వీపర్ కోచ్ లు ఉన్నాయి. కరోనా బాధితుల సేవల కోసం , సామాజిక సేవలో భాగంగా ప్రత్యేక బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలను చేపట్టింది. ఈ బోగిల‌లో పెషేంట్ల‌కు అవ‌స‌ర‌మైన‌ ఆక్షిజన్ తో బాటు వైద్య పరీక్షలు కు సంబంధించి కిట్స్‌ని కూడా అందుబాటులో ఉంచారు. అలాగే వైద్య సిబ్బంది కి బోగి లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. కరోనా కేసులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా బోగి లను సిద్దం చేస్తున్నారు.
సౌత్ జోన్ పరిధిలోని నర్సాపురం, మచిలీపట్నం,కాకినాడ, విజయవాడ స్టేషన్ లకు 50 కోచ్ లను పంపినట్లు సౌత్‌సెంట్ర‌ల్ రైల్వే ప్ర‌క‌టించింది. కేసుల‌ సంఖ్య ఎక్కువ‌గా ఉండి, చికిత్సకు గదులు లేనప్పుడు బోగీల ను వినియోగించుకునే విధంగా ముందు జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. వైర‌స్ బాధితులు ఎటువంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని, ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. రైల్వే క‌ల్పిస్తున్న ఈ అవకాశాన్ని స్థానిక వైద్య సిబ్బంది , ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Follow Us
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
చికెన్ ఖలేజా ఇలా చేస్తే.. హోటల్ రుచి ఇంట్లోనే!
చికెన్ ఖలేజా ఇలా చేస్తే.. హోటల్ రుచి ఇంట్లోనే!