AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచిర్యాలలో కరోనా క‌ల‌క‌లం.. ఒకే రోజు 6 కేసులు

ఏప్రిల్‌ 14న చెన్నూర్‌ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా వల్ల చనిపోయినట్లుగా

మంచిర్యాలలో కరోనా క‌ల‌క‌లం.. ఒకే రోజు 6 కేసులు
Jyothi Gadda
|

Updated on: May 14, 2020 | 11:39 AM

Share

గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ జిల్లాలో త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకున్న క‌రోనా మ‌ళ్లీ త‌న ఉనికిని చాటుకుంటోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఒకేరోజు ఆరుగురికి కరోనా పాజిటివ్ గా రావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

మంచిర్యాల జిల్లాలో క‌రోనా కేసులు పూర్తిగా త‌గ్గిపోయాయి. గ‌త కొద్ది రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా బ‌య‌ట‌ప‌డ‌లేదు.  వీరంతా ముంబయి నుంచి వచ్చిన వలస కూలీలు కావడం గమనార్హం. కరోనా సోకిన వారిలో హజీపూర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు కాగా, దండేపల్లి మండలం నర్సాపూర్‌లో మరో ఇద్దరికి క‌రోనా సోకింది. వీరందరినీ జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు గాంధీ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్సుల్లో తరలించారు.

ఇక‌పోతే, జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలోనూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు లేవు. జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం బాగా తగ్గిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న‌ నేపథ్యంలో తాజా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అంతేకాక, ఏప్రిల్‌ 14న చెన్నూర్‌ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా వల్ల చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. మంచిర్యాల జిల్లాకు ముంబయి నుంచి ఇటీవలే 120 మంది వలస కార్మికులు వచ్చారు. వీరి విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం