AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వారియర్స్: వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కరోనాపై పోరులో ముందువరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి

కరోనా వారియర్స్: వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2020 | 12:09 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కరోనాపై పోరులో ముందువరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి లక్ష తిరుగు ప్రయాణ విమాన టికెట్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన చేసింది.

కాగా.. ఈ ఆఫర్‌ను పొందేందుకు ఆరోగ్య సిబ్బంది తమ వెబ్‌సైట్‌లో వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మే 18 అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమేనని తెలిపింది. ముందుగా వివరాలను నమోదు చేసుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. అన్ని దేశాలకు చెందిన ఆరోగ్య సిబ్బందికి ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.

మరోవైపు.. “ఆరోగ్య సిబ్బందికి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కృతజ్ఞతలు తెలుపుతోంది. వారి నిర్విరామ కృషి వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగారు. వారికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు. మా వంతుగా వారికి తిరుగు ప్రయాణ టిక్కెట్లను అందివ్వాలని నిర్ణయించాం. విమాన ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన తర్వాత ఆరోగ్య సిబ్బంది ఏ ప్రదేశానికి వెళ్లినా వారి తిరుగు ప్రయాణ టికెట్టును ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వారికి ఉచితంగా అందిస్తాం” అని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ గ్రూప్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.

[svt-event date=”14/05/2020,12:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also read: కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్‌’.. ఇక హైదరాబాద్‌లో తయారీ..!

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం