AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మొత్తుకుంటున్నా విన‌ని జ‌నాలు.. సండే వ‌చ్చిందంటే ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల వ‌ద్ద ర‌చ్చ‌, ర‌చ్చ

కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు ఎంత మొత్తుకున్నా ప్రజల్లో మాత్రం మార్పు కనబడటం లేదు, ఆదివారం వస్తే చాలు ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల...

Coronavirus: మొత్తుకుంటున్నా విన‌ని జ‌నాలు.. సండే వ‌చ్చిందంటే ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల వ‌ద్ద ర‌చ్చ‌, ర‌చ్చ
Fish markets
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2021 | 2:36 PM

Share

కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు ఎంత మొత్తుకున్నా ప్రజల్లో మాత్రం మార్పు కనబడటం లేదు, ఆదివారం వస్తే చాలు ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు జనాలు. ఆదివారం ఫిష్ మార్కెట్లు మూసి వేయాలన్న అధికారుల ఆదేశాలు వ్యాపారులు బేఖాతర్‌ చేస్తున్నారు. జూన్‌ 6న ఆదివారం హైదరాబాద్‌లోని రాంనగర్‌కు ఫిష్‌మార్కెట్‌ జనం రద్దీతో కిటకిటలాడింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే లాక్‌డౌన్‌ సడలింపు ఉండటంతో తెల్లవారుజామునే మార్కెట్‌లో వాలిపోయారు. దీంతో ఫిష్‌ మార్కెట్‌ జనంతో కిటకిటలాడింది. భౌతికదూరం పాటించాలనే పోలీసుల హెచ్చరికలను జనం ఖాతర్‌ చేయలేదు.

అటు ఏపీలోనూ ఫిష్‌ మార్కెట్లు కిటకిట లాడాయి. గత మూడు ఆదివారాలు విజయవాడలో అన్ని చేపల మార్కెట్లను మూసివేశారు. తెచ్చిన సరుకు అమ్ముడు పోక నష్టపోయాం అంటూ చేపల వ్యాపారులు గగ్గోలు పెట్టారు. వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని ఉ 6 గంటల నుంచి 10 గం వరకు చేపల మార్కెట్లకు పర్మిషన్ ఇచ్చారు. అయితే నగరంలో మిగతా వ్యాపారస్తుల్లాగే 12 గంట‌ల‌ వరకు అమ్మకాలకు సమయం ఇవ్వాలంటున్నారు చేపల వ్యాపారస్థులు.

ఇటు విశాఖపట్నంలోని గాజువాక మార్కెట్లో కోవిడ్ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. విచ్చలవిడిగా చేపల విక్రయాలు చేపట్టారు. జీవీఎంసీ అధికారుల ఆదేశాలకు విలువే లేకుండా పోయింది. వాస్తవానికి మాంసం, చేపల విక్రయాలను ఆదివారం నిలిపివేశారు అధికారులు. ఈ అవకాశాన్ని కొద్దిమంది వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ చేపలను విక్రయించారు. మాంసం దొరక్కపోవడంతో చేపలకోసం ఎగబడ్డారు. దీంతో కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

జూన్ 8న తెలంగాణ‌ కేబినెట్‌ భేటీ.. ఈ కీల‌క అంశాల‌పై చ‌ర్చ