AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా సోకడంతో బెయిల్‌.. ఆస్పత్రి నుంచి పీపీఈ కిట్‌తో ఎస్కేప్..

హర్యానాలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఆస్పత్రి నుంచి పారిపోవడం కలకలం రేపుతోంది. స్థానిక జింద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆస్పత్రిలోని రెండో అంతస్థు నుంచి దూకి పారిపోయాడు.

కరోనా సోకడంతో బెయిల్‌.. ఆస్పత్రి నుంచి పీపీఈ కిట్‌తో ఎస్కేప్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2020 | 7:35 PM

Share

హర్యానాలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఆస్పత్రి నుంచి పారిపోవడం కలకలం రేపుతోంది. స్థానిక జింద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆస్పత్రిలోని రెండో అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. పారిపోయే సమయంలో పీపీఈ కిట్‌ను కూడా అలానే ధరించి తాడు సహాయంతో కిందకు దూకి పారిపోయాడు. ఇతడు ఓ కేసులో నిందితుడని.. ఇతనిపై ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు నమోదవ్వడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కరోనా పాజిటివ్ సోకడంతో అతడికి ఆస్పత్రిలో చేర్చారు. అయితే నిందితుడు బెయిల్ కోసం కోర్టుకు దాఖలు చేశాడు. దీంతో అతడికి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అప్పటి వరకు నిందితుడి కోసం అక్కడే పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే బెయిల్ మంజూరు కావడంతో అక్కడి నుంచి పోలీసులు సెక్యూరిటీని తొలగించారు. అయితే ఇదే అదనుగా కరోనా సోకిన ఆ వ్యక్తి.. చికిత్స జరుగుతుండగానే పారిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.