AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు...

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 01, 2020 | 3:16 PM

Share

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. ఇక మరణాల సంఖ్య 5 వేలు దాటేసింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. ఇప్పుడు ఈ వైరస్ కారణంగానే ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ లీడర్ ఖష్బూ ఇంట విషాదం చోటు చేసుకుంది.

ఖుష్బూ సమీప బంధువు కరోనా వైరస్ సోకి మృతి చెందటంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ 62 వేలకు మందికిపైగా కరోనా బాధితులుండగా వారిలో రెండువేల మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముంబాయిలో ఉన్న నటి ఖుష్బూ బంధువుకి ఈ వైరస్ సోకగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సానుభూతి ప్రకటిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

బ్రేకింగ్: రేపు ఢిల్లీకి సీఎం జగన్

ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు..

దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!