రాజధానిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు
అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటమే కాకుండా.. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం భావించడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండటం వల్లే.. ఇక్కడి నుంచి ప్రభుత్వం నడిపిస్తున్నారని గుర్తు చేశారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా… రాజధానిని మూడు ముక్కలు చేయాలని అనుకోవడం అన్యాయమన్నారు. అమరావతి అనేది ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను […]
అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటమే కాకుండా.. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం భావించడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండటం వల్లే.. ఇక్కడి నుంచి ప్రభుత్వం నడిపిస్తున్నారని గుర్తు చేశారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా… రాజధానిని మూడు ముక్కలు చేయాలని అనుకోవడం అన్యాయమన్నారు.
అమరావతి అనేది ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. కొవిడ్ -19తో వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు. ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం నడుచుకుంటే బాగుంటుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు సూచించారు.