‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి
ఆస్తి కోసమో లేక డబ్బు కోసమో హత్యలు చేశారన్న వార్తలు వింటూంటారు.. కానీ 'పాల' కోసం హత్య చేయడం ఎక్కడైనా విన్నారా? అవును ఇది నిజమే. ఈ విచిత్ర ఘటన ఉత్తర్ ప్రదేశ్ పురాన్పుర్లోని ఘుంగ్ఛాయ్లో..
ఆస్తి కోసమో లేక డబ్బు కోసమో హత్యలు చేశారన్న వార్తలు వింటూంటారు.. కానీ ‘పాల’ కోసం హత్య చేయడం ఎక్కడైనా విన్నారా? అవును ఇది నిజమే. ఈ విచిత్ర ఘటన ఉత్తర్ ప్రదేశ్ పురాన్పుర్లోని ఘుంగ్ఛాయ్లో చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 16 ఏళ్ల తన కొడుకుతో పాటు తమ్ముడినీ తుపాకితో కాల్చి తానూ.. గుర్ముఖ్ సింగ్ (55) అనే వ్యక్తి ప్రాణాలొదిలాడు. గుర్ముఖ్ తన కోసం దాచుకున్న పాలను అతని కొడుకు జస్కరన్ తాగాడన్న కోపంతో.. ఇద్దరీ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో కొడుకుని తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం గుర్ముఖ్ కూడా తుపాకీతో కాల్చుకుని మరణించాడని.. ఆయన తమ్ముడు వివరించాడు. ఈ ఘర్షణలో తనకీ దెబ్బలు తగిలాయని.. వెంటనే ఆస్పత్రికి వెల్లడంతో ప్రాణాలు దక్కించుకున్నట్లు గుర్ముఖ్ తమ్ముడు అవతార్ సింగ్ పోలీసులకు వివరించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘనటపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కరోనా ‘మెడికల్ జ్యువెలరీ’.. వైరస్తో వ్యాపారమంటూ..
మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..
చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్
హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో తొలి కరోనా కేసు