కర్ణాటకలో 60 వేలకు చేరువలో కరోనా కేసులు
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరోసారి లాక్డౌన్ విధిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించింది. రోజు వేల సంఖ్యలో కరోనా..
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరోసారి లాక్డౌన్ విధిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించింది. రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 4,537 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,652కి చేరింది. వీటిలో 21,775 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 93 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,240కి చేరింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 36,631 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే 29 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4,537 new #COVID19 positive cases, 1018 discharged and 93 deaths reported in Karnataka today. The total number of positive cases in the state rises to 59,652 including 21,775 discharged and 1240 deaths: Govt of Karnataka, Dept of Health & Family Welfare pic.twitter.com/GFPQj5p2A4
— ANI (@ANI) July 18, 2020