AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covishield : కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం, ఫస్ట్‌ – రెండో డోస్‌ మధ్య గ్యాప్‌ పెంచాలని లేఖలు

Covishield Second Dose Gap : వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ సెకండ్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ పెంచాలని..

Covishield : కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం, ఫస్ట్‌ - రెండో డోస్‌ మధ్య గ్యాప్‌ పెంచాలని లేఖలు
Covishield Vaccine
Venkata Narayana
|

Updated on: Mar 22, 2021 | 10:15 PM

Share

Covishield Second Dose Gap : వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ సెకండ్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఫస్ట్‌ డోస్‌కు సెకండ్‌డోస్‌కు గ్యాప్‌ 6-8 వారాలు ఉండేలా చూడాలని ఈ లేఖలో పేర్కొన్నారు. గతంలో ఫస్ట్‌ డోస్‌కు రెండో డోస్‌కు మధ్య తేడా 4-6 వారాలు ఉండేది. కాని ఇప్పుడు ఆ వ్యవధిని మార్చారు. నిపుణుల సూచన తరువాత కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని కూడా కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. భారత్‌లో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌తో పాటు సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు.

కొవిషీల్డ్‌తో మెరుగైన ఫలితాలు పొందేందుకు రెండు డోసుల మధ్య వ్యవధిని 4-8 వారాలకు పెంచాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. . దీనికి సంబంధించి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ వ్యవధి కేవలం కొవిషీల్డ్‌కు మాత్రమే వర్తిస్తుందని దానిలో పేర్కొంది. ‘కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి గురించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఏజీఐ), నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19(ఎన్‌ఈజీవీఏసీ) మరోసారి సమీక్ష జరిపింది. పలు శాస్త్రీయ ఆధారాల నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ జరిగింది’ అని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది.

ప్రస్తుతం రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులుగా ఉంది. అయితే, 4-8 వారాల వ్యవధిలో రెండో డోసును అందిస్తే రక్షణ మరింత మెరుగవుతుందని తెలిపింది. ఆ సమయం ఎనిమిది వారాలు మించరాదని సూచించింది. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్రం జనవరి 16 నుంచి మొదటి దశ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్చి ఒకటిన రెండో దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను అత్యవసర వినియోగం కింద వాడుతున్నారు. ఇప్పటివరకు 4.50 కోట్ల మందికి టీకా డోసులను పంపిణీ చేశారు.

Read also : YS Sharmila : మైనారిటీలతో లోటస్ పాండ్ లో షర్మిల సమ్మేళనం, తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఇలా ఉందంటూ వ్యాఖ్యలు