AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర ఆయాసంతో తండ్రి.. గొంతు త‌డిపిన కుమార్తె.. అంతే..ఆయ‌న ఇక‌లేడు.. బిడ్డ ఆక్రంద‌న‌

కరోనా వచ్చి కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వ‌స్తుంది. తాజాగా..

తీవ్ర ఆయాసంతో తండ్రి.. గొంతు త‌డిపిన కుమార్తె.. అంతే..ఆయ‌న ఇక‌లేడు.. బిడ్డ ఆక్రంద‌న‌
Corona Death
Ram Naramaneni
|

Updated on: May 03, 2021 | 2:58 PM

Share

కరోనా వచ్చి కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వ‌స్తుంది. తాజాగా.. కొవిడ్ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి ఓ కూతురు తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తట్టుకోలేక వెళ్లి తండ్రి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే ఆయన కన్నుమూశారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

జి.సిగడాం మండలం జగన్నాథవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు, విజయవాడలో కూలి పనులు చేస్తూ.. జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల స్వల్ప లక్షణాలతో కరోన నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. అనుమానంతో టెస్టులు చేయించుకున్న కుటుంబసభ్యులకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉంచారు. ఇంతలో అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కిందపడి కొట్టుకుంటున్నాడు. కాగా భార్య దగ్గరికి వెళ్లడానికి భయపడుతుంది.. స్థానికులు మీ అందరికీ పాజిటివే కదమ్మా వెళ్లండి అంటున్నా భయపడుతుంటే.. కూతురు మాత్రం నాన్నా.. నాన్నా.. అంటూ హృదయవిదారకంగా రోధిస్తూ తండ్రి నోట్లో నీళ్లు పోసింది.

ఇంతలో తండ్రి ఎక్కిళ్లు తీసి.. ఆగిపోయాడు.. తల్లి కూతుర్ని దూరంగా లాగేసింది. కాగా అతనికి ఇంకాస్త ఊపిరి ఉందని గ్రామస్తులు అంటుండగా.. సొంత భర్త కళ్లముందే చనిపోతుంటే కరోనా భయం దగ్గరికి వెళ్లకుండా చేస్తున్న కాఠిన్యం అందరన్నీ కలిచి వేస్తోంది.

Also Read: కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత..

క‌రోనా వ్య‌ధ‌లు.. కృష్ణా జిల్లాలో దారుణం.. మృత‌దేహాన్ని ఆస్ప‌త్రిలోనే వ‌దిలేసిన వైనం