AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతల రేషన్ పంపిణీ పూర్తి కాగా.. నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రతీ బియ్యం కార్డుకు కేజీ శనగలతో పాటు ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. […]

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..
Ravi Kiran
|

Updated on: May 16, 2020 | 7:36 AM

Share

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతల రేషన్ పంపిణీ పూర్తి కాగా.. నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రతీ బియ్యం కార్డుకు కేజీ శనగలతో పాటు ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రాష్ట్రంలోని 1,48,05,879 కుటుంబాలకు ఉచితంగా శనగలు, బియ్యం, కందిపప్పును అందించనున్నారు. అటు అర్హత ఉండి, బియ్యం కార్డులేని 81,862 మంది కుటుంబాలకు మూడో విడతలో ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించగా.. వారికి ఈసారి కూడా ఉచిత రేషన్ అందనుంది. కాగా, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపధ్యం రేషన్ షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రజలను కోరుతోంది.

Read More:

దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..

కిమ్ మరో సంచలనం.. ఈసారి వారిపై రహస్య నిఘా!

ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. సీట్లు కుదింపు ఇలా..