AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధానిలో రోడ్డెక్కిన లగ్జరీ బస్సులు..

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లగ్జరీ బస్సులు రోడ్డెక్కాయి. కేవలం నగరం లోపల తిరిగేందుకు మాత్రమే బస్సులకు అనుమతిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతో మంగళవారం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వల్ల గత 56 రోజులుగా ఆగిపోయిన బస్సులు....

రాజధానిలో రోడ్డెక్కిన లగ్జరీ బస్సులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 2:56 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లగ్జరీ బస్సులు రోడ్డెక్కాయి. కేవలం నగరం లోపల తిరిగేందుకు మాత్రమే బస్సులకు అనుమతిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతో మంగళవారం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వల్ల గత 56 రోజులుగా ఆగిపోయిన బస్సులు.. ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఉద్యోగాలు చేసే వాళ్లు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తూండటంతో.. బస్సులకు అనుమతిచ్చింది. నిజానికి ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ.. ప్రజల కష్టాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని నగరంలో బస్సులకు పర్మిషన్ ఇచ్చారు కేజ్రీవాల్. దీంతో మొత్తం 3400 డీటీసీ బస్సులు రోడ్డెక్కాయి. కానీ మెట్రో రైళ్లు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

కాగా ప్రైవేట్ వాహనాలు, ఆటోలు కూడా తిరిగేందుకు పర్మిషన్ ఇచ్చారు సీఎం. ఏ వాహనమైనా తిరగొచ్చు కానీ.. పరిశుభ్రత, శానిటేషన్ బాధ్యత డ్రైవర్లే చూసుకోవాలి. ప్రయాణికుల్ని దించిన ప్రతీ రౌండ్‌కీ శానిటేషన్ చెయ్యాల్సిందేనని సూచించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు బాగానే హాజరవుతున్నారు. ఫోన్‌లో కూడా ఆరోగ్య సేతు యాప్‌ని కూడా మెయిన్‌టైన్ చేస్తున్నారు.

అలాగే రెస్టారెంట్లు ఫుడ్‌ని హోం డెలివరీ చేయడానికి అనుమతిచ్చారు.. కానీ రెస్టారెంట్లు మాత్రం తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా మరీ రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌‌ వంటి వాటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కాగా ఢిల్లీలో కూడా లాక్‌డౌన్ మే 31 వరకూ కొనసాగుతోంది. అక్కడ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

ఇది కూడా చదవండి: 

బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌