షాకింగ్ న్యూస్ … బిగ్గరగా మాట్లాడినా కరోనా..
బిగ్గరగా మాట్లాడితే నోటి నుంచి వచ్చే సూక్ష్మ నీటి బిందువులు గాల్లోకి చేరి కరోనా వైరస్ వ్యాప్తి చెంది, దాదాపు 14 నిమిషాలు జీవించి ఉంటుందని.. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పరిశోధికులు..
ఇప్పటివరకూ ఎన్ని రకాలుగా కరోనా వ్యాప్తి చెందుతుందో.. అన్నింటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాం. మాస్క్ పెట్టుకుంటూ, చేతులను శుభ్రపరుస్తూ, శానిటైజ్ రాసుకుంటున్నాం. కరోనా వ్యాప్తి అరికట్టడానికి దాదాపు కొన్ని రోజులు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు శాస్త్రవేత్తలు. బిగ్గరగా మాట్లాడినా, అరిచినా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందట. ఇలా బయటకొచ్చిన కరోనా ప్రభావం ఏకంగా 14 నిమిషాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
బిగ్గరగా మాట్లాడితే నోటి నుంచి వచ్చే సూక్ష్మ నీటి బిందువులు గాల్లోకి చేరి కరోనా వైరస్ వ్యాప్తి చెంది, దాదాపు 14 నిమిషాలు జీవించి ఉంటుందని.. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పరిశోధికులు గుర్తించారు. గట్టిగా మాట్లాడినప్పుడు చిన్న చిన్న బిందువులు నోటి నుంచి విడుదల అవుతాయి. అవి గాలిలో 14 నిమిషాల వరకూ జీవించే ఉంటాయి. ఆ నీటి బిందువులే కరోనా వ్యాప్తికి కారణం అవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఓ లేజర్ లైట్ ఉపయోగించి.. కరోనా సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు నోటి నునంచి ఎన్ని తుంపర్లు బయటకు వచ్చాయో లెక్కకట్టగా.. సెకనుకు వెయ్యి కంటే ఎక్కువ నీటి తుంపర్లు విడుదల అవుతాయని తేలింది. అందుకే మాట్లాడేటప్పుడు కూడా నోటికి మాస్క్ పెట్టుకోవడం ఉత్తమమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:
కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి