AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మరణాల్లో మొదటిస్థానం ఢిల్లీదే !

రాజధాని ఢిల్లీని మహమ్మారి వణికిస్తోంది. రోజువారీ మరణాల్లో ఢిల్లీ మహారాష్ట్రను దాటిపోయింది. 24 గంటల్లో మహారాష్ట్రలో 127 మరణాలు సంభవించగా ఢిల్లీలో 129 నమోదయ్యాయి. ఈ విషయంలో మరో రాష్ట్రం మహారాష్ట్రను దాటడం ఇదే తొలిసారి.

కరోనా మరణాల్లో మొదటిస్థానం ఢిల్లీదే !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 7:37 AM

Share

దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్యపరంగా నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ రోజువారీ కేసుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 11,458 కేసులు నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీని మహమ్మారి వణికిస్తోంది. రోజువారీ మరణాల్లో ఢిల్లీ మహారాష్ట్రను దాటిపోయింది. 24 గంటల్లో మహారాష్ట్రలో 127 మరణాలు సంభవించగా ఢిల్లీలో 129 నమోదయ్యాయి. ఈ విషయంలో మరో రాష్ట్రం మహారాష్ట్రను దాటడం ఇదే తొలిసారి. ఈ నెల 1 నుంచి మహారాష్ట్రలో మరణాలు 62శాతం పెరగగా, ఢిల్లీలో 156శాతం పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 17 రాష్ట్రాల్లో 386 మరణాలు సంభవించగా అందులో 66శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రోజువారీ మరణాలు అధికమవుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో కేసులు లక్ష దాటాయి. మహారాష్ట్రలో రోజువారీ కేసులు వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగా నమోదు కాగా, ఢిల్లీలో తొలిసారి రెండు వేల మార్కు దాటింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహా మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నా, రోజువారీ వృద్ధిరేటు క్రమంగా తగ్గుతోంది. లాక్‌డౌన్‌ చివరి వారంలో సగటున 4.72శాతం మేర కేసులు పెరగగా, ఈ నెల తొలి వారానికల్లా అది 4.42శాతానికి తగ్గింది. రెండో వారంలో 3.82శాతానికి చేరింది. మొత్తం కేసులు రెట్టింపయ్యే రేటు 18 రోజులకు పెరగగా, క్రియాశీలక కేసుల విషయంలో అది 23 రోజులకు చేరింది. కోలుకున్న వారి శాతం శనివారం నాటికి 49.94కి పెరిగింది.