AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid XE Variant: మురిపెం మూన్నాళ్లే.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. స్కూల్‌ విద్యార్థులకు పాజిటివ్..!

Covid XE Variant: కరోనా తగ్గుతోందని సంబరపడతున్న వేళ మరో బాంబు పడింది. భారత్‌లో కొత్త వేరియంట్‌ ఎంట్రీ కలకలం రేపుతోంది. కరోనా ముప్పు తగ్గలేదు..

Covid XE Variant: మురిపెం మూన్నాళ్లే.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. స్కూల్‌ విద్యార్థులకు పాజిటివ్..!
corona
Shiva Prajapati
|

Updated on: Apr 12, 2022 | 5:48 AM

Share

Covid XE Variant: కరోనా తగ్గుతోందని సంబరపడతున్న వేళ మరో బాంబు పడింది. భారత్‌లో కొత్త వేరియంట్‌ ఎంట్రీ కలకలం రేపుతోంది. కరోనా ముప్పు తగ్గలేదు..జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు అధికారులు. మరోవైపు కరోనా ముప్పు తగ్గలేదని.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని WHO పదే పదే హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్‌ ఎంట్రీ అయ్యిందన్న విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్‌ కేసులు ముంబైలో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ సైతం కోవిడ్‌ ముప్పు ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదని, జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యే హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ వైశాలిలో కేఆర్‌ మంగళం వరల్డ్ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా స్కూల్‌ యజమాన్యం ఆఫ్‌లైన్‌ క్లాస్‌లను నిలిపేసింది. స్కూల్‌ యాజమాన్యం రెండు రోజులపాటు ఆన్‌లైన్‌ మోడ్‌లోనే క్లాస్‌లు నిర్వహించింది. ఇక ఇంటితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా వ్యవహరించాలని పేరెంట్స్‌నూ కోరింది. స్కూల్‌లో ప్రతి రోజూ తప్పకుండా కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు మొత్తం స్కూల్ క్యాంపస్‌ను నిత్యం శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇటీవలే ఘజియాబాద్‌లోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి మరువక ముందే కొద్దిరోజుల్లోనే మరో ఘటన వెలుగు చూసింది. దాంతో తమ పిల్లలను స్కూల్‌కి పంపేందుకు పేరెంట్స్‌ భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తెరవాలని, యథావిధిగా తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..