‘కరోనా దేవుడు విధించిన శిక్ష’..సమాజ్వాదీ పార్టీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
కరోనాపై ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 100ఏళ్లకు ఒకసారి వచ్చే ఇటువంటి మహమ్మారి ..ప్రజల్ని వణికిస్తుందని కొందరు చెబుతుంటే..మరికొందరు ప్రకృతికి కోపం వచ్చిందని..అందుకే పగ సాధిస్తుందని అంటున్నారు. అయితే,..

కరోనాపై ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 100ఏళ్లకు ఒకసారి వచ్చే ఇటువంటి మహమ్మారి ..ప్రజల్ని వణికిస్తుందని కొందరు చెబుతుంటే..మరికొందరు ప్రకృతికి కోపం వచ్చిందని..అందుకే పగ సాధిస్తుందని అంటున్నారు. అయితే, తాజాగా సమాజ్ వాదీ పార్టీకి చెందని ఎంపీ ఒకరు కరోనా వైరస్పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్లోని సంబల్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ షఫికుర్ రెహ్మాన్ బార్క్ కరోనా వైరస్ రోగం కాదని, మనం చేసిన పాపాలకు దేవుడు విధించిన శిక్ష అని వ్యాఖ్యానించారు. అందుకే కరోనా వైరస్కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సా విధానాన్ని కనిపెట్టలేకపోయారని ఆయన చెప్పారు. మనమంతా దేవుడ్ని ప్రార్థిస్తేనే కరోనా అంతమవుతుందని రెహ్మాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో బక్రీద్ను పురస్కరించుకుని ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాలను తెరువాలని ఆయన కోరారు. అలాగే మేకలు, గొర్రెలు అమ్మే మార్కెట్లను అందుబాటులో ఉంచాలని ఎంపీ షఫికుర్ రెహ్మాన్ సూచించారు.
