Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచండి.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా (Coronavirus)పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజులు 5 శాతం దాటింది.

Covid-19: ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచండి.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ
Covid Hospitals
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2022 | 11:07 AM

Union Health Secretary letter to States: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా (Coronavirus)పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజులు 5 శాతం దాటింది. కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం(Union Government) అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సదుపాయాలను మరింతగా మెరుగుపర్చాలని సూచించింది.

ఆరోగ్య సేవలు, ఆసుపత్రులలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆరోగ్య సేవలు విస్తృత పర్చాలని సూచించారు. ఆరోగ్య సేవల్లో కనీసం 48 గంటల పాటు తగినంత పరిమాణంలో మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తన లేఖలో తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ నిర్వహణపై కూడా శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఈ ప్లాంట్ల పనితీరు, తగినంత ఆక్సిజన్ గాఢత ఉండేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

Covid Letter

Covid Letter 1

Covid LetterRead Also….  Lakshadweep: లక్షద్వీప్ మరో ఘనత.. 15-18 ఏళ్ల పిల్లలకు 100 శాతం వ్యాక్సినేషన్..