AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా…ఏపీలో మ‌ళ్లీ 60 కేసులు

తెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా వైర‌స్ వ‌ద‌ల‌టం లేదు. ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా...ఏపీలో మ‌ళ్లీ 60 కేసులు
Jyothi Gadda
| Edited By: |

Updated on: May 06, 2020 | 12:16 PM

Share

తెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా వైర‌స్ వ‌ద‌ల‌టం లేదు. ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కొత్తగా మ‌రో 60 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఏలో గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్‌ పరీక్షించగా.. 60 మందికి కరోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్దారణ అయ్యింద‌ని వైద్యాధికారులు తెలిపారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, క‌డ‌ప  జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇక, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పట్టింది. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. మంగ‌ళ‌వారం రాష్ట్రంలో కేవలం 11కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో కోలుకొని నిన్న ఒక్క‌రోజే 43 మంది డిశ్చార్జి అయ్యారు. తాజా లెక్కలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1096కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 628 మంది కోలుకోగా.. 29 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 439 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో మరణాల రేటు విషయంలోనూ తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు సీఎం కేసీఆర్. దేశంలో మరణాల రేటు 3.32గా ఉంటే తెలంగాణలో 2.64 మాత్రమే ఉందన్నారు. అటు రికవరిలోనూ తెలంగాణలో మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 27.40గా ఉంటే.. తెలంగాణలో 57శాతం ఉందని చెప్పారు సీఎం కేసీఆర్. ఇక యాక్టివ్ కేసుల విషయంలో దేశవ్యాప్త రేటు 69.21గా ఉంటే.. తెలంగాణలో 42.7గా ఉందని పేర్కొన్నారు. అంటే కరోనా బాధితుల్లో మన రాష్ట్రంలో ఎక్కువ మంది కోలుకుంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు .