దేశంలో లాక్ డౌన్.. టీవి కార్మికులకు సీరియల్ ప్రొడ్యూసర్లు చేయూత.!

Coronavirus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో జనజీవనం మొత్తం స్తంబించిపోయింది. అన్ని రంగాలపైనే ఈ ఎఫెక్ట్ పడటంతో రోజువారీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. అటు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ షూటింగులను నిలిపివేసింది. అంతేకాకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో జూనియర్ ఆర్టిస్టులు, రోజూ వారి కూలీలు పనులు లేక […]

దేశంలో లాక్ డౌన్.. టీవి కార్మికులకు సీరియల్ ప్రొడ్యూసర్లు చేయూత.!
Follow us

|

Updated on: Mar 29, 2020 | 2:31 PM

Coronavirus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో జనజీవనం మొత్తం స్తంబించిపోయింది. అన్ని రంగాలపైనే ఈ ఎఫెక్ట్ పడటంతో రోజువారీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. అటు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ షూటింగులను నిలిపివేసింది. అంతేకాకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో జూనియర్ ఆర్టిస్టులు, రోజూ వారి కూలీలు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. వారి కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిపోయింది.

ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుడగు వేశారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసస్ ఛారిటీని ప్రారంభించారు. ఈ చారిటీకి ఇప్పటికే పలువురు సీనియర్, యంగ్ హీరోలు విరాళాలు అందజేశారు. ఇక ఇదే కోవలో టీవి సీరియల్ ప్రొడ్యూసర్లు కూడా ఓ ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంను నిర్వహించాలని ఆలోచిస్తున్నారట. బుల్లితెరలో పని చేసే డైలీ వేజ్ వర్కర్లు, జూనియర్ ఆర్టిస్టులను ఆదుకోవడమే కాకుండా వారి కుటుంబాలకు ఆహార పదార్ధాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు సీరియల్ షూటింగులను కూడా నిరవధికంగా వాయిదా వేయనున్నట్లు సమాచారం.

ఇవి చదవండి:

 దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..

Latest Articles