AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. అంతకంతకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

రికార్డు స్థాయిలో కరోనా కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2020 | 10:07 PM

Share

తెలంగాణలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. అంతకంతకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనాతో ఎనిమిది మంది బాధితులు మృతి చెందారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,737కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 182 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2.352 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదు అయిన కరోనా కేసుల్లో అత్యధికంగా 179 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో 24, మేడ్చల్‌లో 14, రంగారెడ్డి 11, మహబూబ్‌నగర్‌ 4, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, నల్లగొండ, ములుగు, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండేసి చొప్పున నమోదయ్యాయి. సిద్దిపేట, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి, జగిత్యాలలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.