AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా లాక్‌డౌన్‌.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇంట్లో ఒక్కరికే పాస్‌..!

కరోనా విజృంభిస్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో నిత్యావసరాలకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చి.. ఆ ఒక్కరికే పాస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనాపై సమీక్ష జరిపిన సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మండలాల వారీగా ఇంటికి ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించిన జగన్.. క్వారంటైన్ సెంటర్లను పెంచాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా […]

కరోనా లాక్‌డౌన్‌.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇంట్లో ఒక్కరికే పాస్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 02, 2020 | 9:52 PM

Share

కరోనా విజృంభిస్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో నిత్యావసరాలకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చి.. ఆ ఒక్కరికే పాస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనాపై సమీక్ష జరిపిన సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మండలాల వారీగా ఇంటికి ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించిన జగన్.. క్వారంటైన్ సెంటర్లను పెంచాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతిని కల్పించాలని ఆయన అన్నారు. వారికి కావాల్సిన మౌళిక వసతులు కూడా కల్పించాలని తెలిపారు.

భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని.. క్వారంటైన్ విషయంలో నిర్లక్ష్యం తగదని ఆయన అధికారులను హెచ్చరించారు. కనీసం లక్ష బెడ్లు అయినా సిద్ధం చేసుకోవాలని జగన్ పేర్కొన్నారు. ఇక వీరి కోసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలకు తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read This Story Also: షూటింగ్ పూర్తి కాని రిషి చివరి చిత్రం.. దర్శకనిర్మాతలు ఏం చేయబోతున్నారంటే..!