AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్‌భ‌వ‌న్‌లో న‌లుగురు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్

కరోనా కేసుల‌ ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగులకు కరోనా సోకింది. రాజ్‌భ‌వ‌న్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

రాజ్‌భ‌వ‌న్‌లో న‌లుగురు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్
Jyothi Gadda
|

Updated on: Apr 27, 2020 | 1:08 PM

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా కేసుల‌ ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా ఏపీ రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగులకు కరోనా సోకింది. రాజ్‌భ‌వ‌న్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

ఏపీ రాజ్‌భ‌వ‌న్‌లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాజ్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. సిబ్బందిలో కొందరికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ సహా 8 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైద్యసిబ్బందిలో ఒకరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సోకిన వారిలో గవర్నర్ కు చీఫ్ సెక్యూరిటీ సిబ్బందిగా విధులను నిర్వహిస్తున్న  వ్యక్తికి, మెడికల్ స్టాఫ్ (ఓ నర్స్)  ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే ఓ బట్లర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కూడా వైరస్ సోకిందని తెలిపారు. ఈ విషయం తెలియగానే తనకు కూడా పరీక్షలు చేయాలని గవర్నర్ స్వయంగా కోరారని రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది.
మరోవైపు వైసీపీ ఎంపీ కుటుంబానికి సైతం కరోనా సోకిందని తేలింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన కర్నూలు జిల్లాలో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా  తేలింది. ఎంపీ తండ్రితో పాటు, ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, ఒకరి కుమారుడు ఉన్నారు. ఎంపీ తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు. కాగా, వీరి ఫ్యామిలీలో వైర‌స్ బారిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులుగా తెలుస్తోంది.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం