AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 45 ఏళ్లకు తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఏడాది తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన ముద్దుగుమ్మ..

తెలుగులో ఒకటి, రెండు సినిమాలతో ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ముద్దుగుమ్మలు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలోని శుభవార్తను అభిమానులతో పంచుకుంది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, సెలబ్రెటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tollywood : 45 ఏళ్లకు తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఏడాది తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన ముద్దుగుమ్మ..
Padma Priya
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2026 | 9:38 AM

Share

తెలుగు ప్రేక్షకులకు పద్మప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈతరం అడియన్స్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ శ్రీను వాసంతి లక్ష్మీ సినిమా నటి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతోనే కథనాయికగా వెండితెరకు పరిచయమైంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో అనేక చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే కెరీర్ మంచి ఫాంలోనే ఉన్నప్పుుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే పెళ్లైన పన్నెండేళ్లకు ఆమె ఇప్పుడు తల్లైంది. ఈ విషయాన్ని తన బిడ్డ పుట్టిన ఏడాదికి అభిమానులతో పంచుకున్నారు. రెండు ఫోటోలు షేర్ చేసింది. అయితే తనకు పుట్టిన బాబు, లేదా పాప అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

పద్మప్రియ.. 2014లో జాస్మిన్ షా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడు ఆప్ పార్టీకి చెందిన నేత. పెళ్లి తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు తాను తల్లైనట్లు వెల్లడించింది. గత ఏడాదిగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో చాలా యాక్టివ్ గా ఉంది. కానీ తన బిడ్డ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక ఇప్పుడు తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని పంచుకోవడంతో అభిమానులు, సినీ తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కేరళకు చెందిన పద్మప్రియ.. టాలీవుడ్ సినిమాలతోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. అందరి బంధువయ, పటేల్ సర్ వంటి చిత్రాలు చేసింది. అయితే ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మలయాళంలో మాత్రం స్టార్ డమ్ అందుకుంది. చివరగా 2022లో వండర్ ఉమెన్ చిత్రంలో నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

పద్మప్రియ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

Follow Us