ఆన్‌లైన్ పరీక్షలు వద్దంటూ విద్యార్థుల ఆందోళన

పరీక్షలు నిర్వహించకుండానే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఆన్‌లైన్ పరీక్షలు వద్దంటూ విద్యార్థుల ఆందోళన
Follow us

|

Updated on: May 18, 2020 | 6:10 PM

కరోనా నేపథ్యంలో దేశంమొత్తం లాక్‌డౌన్ పాటిస్తోంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గానూ విద్య, వ్యాపార, రవాణా వంటి అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కూలీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యా సంవత్సరం మధ్యలోనే స్కూళ్లు, కాలేజీలు మూతపడటంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో 1-9వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించగా, ఉన్నత విద్యలో మాత్రం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ..పరీక్షలు నిర్వహిస్తామని ఆయా రాష్ట్రాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొందరు ఆన్ లైన్ పాఠాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా పరీక్షలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్ ద్వారా పోర్షన్లను పూర్తిచేయాలని, జూన్ మొదటి వారంలో పరీక్ష తేదీలను ప్రకటిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ వైస్ చాన్స్‌లర్లు, ఇనిస్టిట్యూట్ల హెడ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆన్‌లైన్ వేధికగా తమ నిరసన వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించకుండానే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున సంతకాలు చేపట్టారు.

అయితే, ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం పోర్షన్ పెండింగులో ఉందన్నారు. ఆన్‌లైన్‌లో చెబుతున్న పాఠాలు తమకు ఏమాత్రం అర్థం కావడం లేదని అన్నారు. నోట్స్ ఆన్‌లైన్‌లో పంపారని, దానిని తాము సొంతంగా చదివి అర్థం చేసుకోవటం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!