AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ న్యూస్‌.. ప్లాస్మా థెరపీ చేయించుకున్న మొదటి వ్యక్తి మృతి

కరోనా నుంచి కోలుకోవడం కోసం పలువురికి డాక్టర్లు ప్లాస్మా థెరపీ చేసిన విషయం తెలిసిందే. అయితే అది కొన్ని చోట్ల సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ..

షాకింగ్ న్యూస్‌.. ప్లాస్మా థెరపీ చేయించుకున్న మొదటి వ్యక్తి మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 2:09 PM

Share

కరోనా నుంచి కోలుకోవడం కోసం పలువురికి డాక్టర్లు ప్లాస్మా థెరపీ చేసిన విషయం తెలిసిందే. అయితే అది కొన్ని చోట్ల సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ.. మరికొన్ని చోట్ల ఇవ్వడం లేదు. తాజాగా ప్లాస్మా థెరపీ చేయించుకున్న 52ఏళ్ల వృద్ధుడు కన్నుమూశాడు. మహారాష్ట్రలో తొలిసారి ఫ్లాస్మా థెరపీ చేయించుకున్న ఈ వ్యక్తి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆ వ్యక్తి సెప్టిసిమియాతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాడని.. ప్లాస్మా థెరపీ చేయించిన తరువాత కాస్త కోలుకున్నాడని అక్కడి డాక్టర్లు తెలిపారు.

కాగా ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇటీవల పేర్కొన్నారు. ‘కరోనా’ నివారణకు ఈ థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవని.. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని, దీనికి ఆమోదం లభించే వరకు ప్లాస్మా థెరపీ పద్ధతి వద్దని ఆయన వెల్లడించారు.పేషెంట్‌కు ప్లాస్మా చికిత్సను సరైన పద్ధతిలో అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు. కాగా ప్లాస్మా థెరపీ పద్దతి అంటే.. కరోనాను జయించిన వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరించి.. అందులోని ప్లాస్మాను కరోనాతో బాధపడే వ్యక్తికి ఎక్కించడం. ఈ పద్దతి కొన్ని చోట్ల మంచి ఫలితాలను ఇచ్చింది. దీంతో కరోనాను జయించిన చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

Read This Story Also: హైద‌రాబాద్‌లో హాట్‌స్పాట్ సెంట‌ర్లు ఇవే..!